Friday, 14 February 2025 07:36:21 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Allu Arjun – Nikhil Advani : అల్లు అర్జున్‌తో సినిమా తీయాలనుకున్నా.. బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మాట్లాడారు.. డైరెక్టర్ వ్యాఖ్యలు..

Date : 01 August 2024 06:14 PM Views : 57

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Allu Arjun – Nikhil Advani : ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అనుకునే వాళ్ళు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో క్లాసిక్ సినిమాలు బాలీవుడ్ అందించింది. కానీ కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత బాలీవుడ్ పరాజయాల పాలైంది. బాలీవుడ్ లో ఒకటి రెండు తప్ప వచ్చిన సినిమా వచ్చినట్టు స్టార్ హీరోల సినిమాలతో సహా ఫ్లాప్స్ అయ్యాయి. చాలా సినిమాలకు పెట్టిన బడ్జెట్లు కూడా రాలేదు. ఒకానొక దశలో అయ్యో పాపం బాలీవుడ్ కూడా అనుకున్నారు. అదే టైంలో మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వరుస హిట్లు కొట్టడంతో బాలీవుడ్ సినిమాలకు మరింత దెబ్బ పడింది. దీంతో బాలీవుడ్ పై సౌత్, నార్త్ అన్ని పరిశ్రమల ప్రముఖులు కామెంట్లు చేశారు. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ సినిమా గురించి అల్లు అర్జున్ మాట్లాడిన మాటలను తెలిపాడు. డైరెక్టర్ నిఖిల్ అద్వానీ జాన్ అబ్రహంతో తెరకెక్కించిన వేద సినిమా ఆగస్టు 15 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో అల్లుఅర్జున్ ప్రస్తావన గురించి రాగా నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. గతంలో అల్లు అర్జున్ తో నేనొక సినిమా చేయాలని అతన్ని కలిసాను. అప్పుడు ఆయన బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ బాలీవుడ్ పరిస్థితిపై నిరాశ వ్యక్తపరిచారు. బాలీవుడ్ కి ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీకు తెలుసు కానీ మీరెందుకు మర్చిపోయారు అని అడిగారు. ఆయన అడిగింది కూడా నిజమే. సౌత్ సినిమాల్లో హీరోయిజం తో పాటు అందులోని ఎమోషన్స్ ని బాగా చూపిస్తారు. బాలీవుడ్ లో కూడా ఒకప్పుడు అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో ఆ ఎమోషన్ తగ్గింది అని అన్నారు. దీంతో డైరెక్టర్ నిఖిల్ అద్వానీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు