Studio18 News - అంతర్జాతీయం / : లెబనాన్ పర్యటనకు రావొద్దంటూ అక్కడి భారత రాయబార కార్యాలయం గురువారం హెచ్చరిక జారీ చేసింది. భారతీయులు ఎవరూ ఈ దేశానికి రావొద్దని సూచించింది. అలాగే లెబనాన్లో ఉన్న భారతీయులు కూడా వెళ్లిపోవాలని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటే అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు భారతీయులు ఎవరూ లెబనాన్కు రావొద్దని పేర్కొంది. ఏదైనా అవసరమైతే ID cons.beirut@mea.gov.in ఈమెయిల్ ద్వారా లేదా ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ +96176860128 ద్వారా బీరుట్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
Admin
Studio18 News