Sunday, 08 March 2026 10:26:05 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

త్వరలోనే పహల్గామ్ కు వెళతా: కమలహాసన్

Date : 27 May 2025 06:22 PM Views : 184

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తాజా చిత్రం 'థగ్ లైఫ్' విడుదలకు సిద్ధమవుతుతోంది. ఈ తరుణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే తగ్గించామని కమలహాసన్ స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంబరాలు చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శింబు, త్రిష వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా గురించి కమల్ మాట్లాడుతూ, " 'థగ్ లైఫ్' చిత్రాన్ని అనేక భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందించాం. చిత్ర బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేసింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. అయితే, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నందున, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని కమల్ చెప్పారు. "ఇలాంటి సమయంలో మనం సినిమా వేడుకలు ఘనంగా జరుపుకోవడం సమంజసం కాదు. అందుకే మా సినిమా ఈవెంట్లను చాలా వరకు వాయిదా వేసుకున్నాం. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదు" అని ఆయన వివరించారు. త్వరలోనే తాను కశ్మీర్‌లోని పహల్గామ్ కు వెళతానని కమల్ హాసన్ ప్రకటించారు. "పహల్గామ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అది కూడా నా దేశంలో అంతర్భాగమే. అక్కడికి వెళ్లి పర్యాటకులకు ధైర్యం చెప్పి, భరోసా కల్పిస్తాను. దేశంలోని అన్ని ప్రాంతాలు మనవే. ఎక్కడ ఏ ఆపద వచ్చినా స్పందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆ బాధ్యతతోనే నేను ఇప్పటివరకు నడుచుకుంటున్నాను" అని తెలిపారు. 'థగ్ లైఫ్' చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :