Saturday, 08 November 2025 10:11:53 PM
# Rajamouli: మహేశ్-రాజమౌళి సినిమాకు తొలి విమర్శ.. '24'ను కాపీ కొట్టారా? # Nara Lokesh: పాట్నా చేరుకున్న నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు # Rajinikanth: అన్నకు గుండెపోటు... షూటింగ్ ఆపేసి బెంగళూరు వెళ్లిన రజనీకాంత్ # Devajit Saikia: ఆసియా కప్ ట్రోఫీ వివాదం... స్పందించిన బీసీసీఐ కార్యదర్శి సైకియా # Pawan Kalyan: ఆపరేషన్ మొదలైతే ఆగదు... ఎర్రచందనం స్మగర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ # Jaggareddy: బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నా నేను గంజికే కనెక్ట్ అయ్యాను: జగ్గారెడ్డి # Anu Emmanuel: 'ది గర్ల్ ఫ్రెండ్' నా హృదయంలో నిలిచిపోయే సినిమా: అను ఇమ్మాన్యుయేల్ # SEBI: డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారా? కొనుగోలుదారులకు సెబీ అలర్ట్ # Vidadala Rajini: అక్రమ కేసులు పెడుతున్న వారిని వదిలిపెట్టను.. పోలీసులను హెచ్చరించిన రజిని # Pinarayi Vijayan: వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం... తీవ్రంగా స్పందించిన కేరళ సీఎం # Rajasthan bus robbery: రాజస్థాన్‌లో సినిమా ఫక్కీలో బస్సు దోపిడీ యత్నం # Steve Waugh: ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు.. కోహ్లీ, రోహిత్‌పై స్టీవ్ వా కీలక వ్యాఖ్యలు # James Watson: డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత # Revanth Reddy: రేవంత్ కు చంద్రబాబు, స్టాలిన్, సోనియా, రాహుల్, చిరంజీవి, డీకే శుభాకాంక్షలు # Prashant Kishor: లాలూ పేరు చెప్పి మోదీ భయపెడుతున్నారు: ప్రశాంత్ కిశోర్ # Womens Cricket: మహిళల క్రికెట్ సరికొత్త చరిత్ర.. వ్యూయర్‌షిప్‌లో పురుషులతో సమం # Hanamkonda: వేలాది నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? .. హన్మకొండలో ఇదే జరిగింది.. ఎగబడిన జనం! # AP Lawyers Welfare Fund: ఏపీలో 1,150 లాయర్ల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున సాయం # Rashmika Mandanna: పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్య # India Vs Pakistan: ఒలింపిక్స్‌లో దాయాదుల పోరు అనుమానమే.. ఐసీసీ కొత్త నిబంధనతో పాక్‌కు కష్టాలు

ఢిల్లీలో రెడ్అలర్ట్ జారీ.. మూతపడ్డ పాఠశాలలు.. పలు విమానాలు రద్దు

Date : 01 August 2024 11:46 AM Views : 168

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Heavy Rains In Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతోపాటు కుండపోత వర్షం కురవడంతో ఢిల్లీకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా 22ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె ప్రమాదవశాత్తూ ఘాజీపూర్ ప్రాంతంలో డ్రైనేజీలో పడి మరణించారు. భారీ వర్షం కారణంగా రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. విద్యాశాఖ మంత్రి అతిషి ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ -నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో కూడా భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల కొద్దీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లుకూలి వ్యక్తికి గాయాలయ్యాయి. వసంత్ కుంజ్ లో భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. కుండపోత వర్షం కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ వెళ్లే 10 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :