Thursday, 15 May 2025 02:31:02 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

భారత్, ఇజ్రాయెల్ రెండూ ఒకటే... వారికి ఇస్లాం నచ్చదు: పాక్ రక్షణ మంత్రి

Date : 09 May 2025 04:20 PM Views : 20

Studio18 News - అంతర్జాతీయం / : భారత్ తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఏ ఇతర దేశం ఒత్తిడినీ అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎలాంటి చర్య ఎదురైనా, దానికి 200 శాతం దీటుగా స్పందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. "పాక్ సైన్యం ఎప్పుడూ భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకోదు. మా దాడులు కేవలం వారి సైనిక స్థావరాలకే పరిమితం అవుతాయి" అని తెలిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత దళాల చర్యలను పాకిస్థాన్ సైన్యం సమర్థవంతంగా అడ్డుకుందని చెప్పారు. భారత డ్రోన్లు తమ భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ, తమ కీలక సైనిక స్థానాలు, వ్యూహాత్మక ప్రదేశాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే వాటిని వెంటనే అడ్డుకోలేదని, అవి తమ పరిధిలోకి వచ్చిన తర్వాత కూల్చివేశామని ఆయన ఒక కొత్త వాదనను వినిపించారు. భారతదేశంలోని మీడియా తన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. యుద్ధంలో భారత్ ఓటమి పాలవుతుందనే నిజాన్ని భారత మీడియా వెల్లడించడం లేదని ఆయన అన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య సహజమైన పొత్తు ఉందని, ఈ రెండు దేశాలు ఇస్లాం పట్ల బహిరంగ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ కు టర్కీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు మద్దతు పలుకుతున్నాయని, కానీ భారత్ కు దాని మిత్రదేశాల నుంచి కూడా సరైన సహాయం అందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :