Thursday, 15 May 2025 02:00:04 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

కరాచీ పోర్టుపై నిన్న రాత్రి ఇండియన్ నేవీ దాడి చేసిందనే వార్తల్లో నిజమెంత?

Date : 09 May 2025 03:59 PM Views : 21

Studio18 News - అంతర్జాతీయం / : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ దాడి చేసిందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కరాచీ పోర్టు ట్రస్ట్ (KPT) అధికారులు ఖండించారు, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని, తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. వివిధ వార్తా సంస్థల కథనాల ప్రకారం, నిన్న రాత్రి కరాచీ నౌకాశ్రయ ప్రాంతానికి దగ్గరగా అనేక పేలుళ్లు సంభవించాయి. పాకిస్థానీ నావికా స్థావరాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగి ఉండవచ్చని అనధికారిక సమాచారం వ్యాపించింది. కరాచీ పోర్టుపై దాడి దృశ్యాలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. ఈ నేపథ్యంలో, కరాచీ పోర్టు ట్రస్ట్ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కరాచీ పోర్టుపై భారత్ దాడి చేసిందంటూ తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయని, వాస్తవానికి తమ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వారు తెలిపారు. తమ హ్యాక్ అయిన ఖాతా నుంచి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు మీడియా సంస్థలు తమ అధికారిక పౌరసంబంధాల విభాగం ద్వారా ధృవీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరాచీలో జరిగిన ఘటనలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటనల కోసం ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :