Thursday, 15 May 2025 02:15:49 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

నమ్ముకున్న పాకిస్థాన్ ను ముంచేసిన చైనా... పేలకుండా తుస్సుమన్న చైనా మిస్సైల్

Date : 09 May 2025 03:11 PM Views : 19

Studio18 News - అంతర్జాతీయం / : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తోంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు నిష్ఫలమవ్వడమే కాకుండా, కొన్ని పేలకుండానే కిందపడిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో పాకిస్థాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. మరోవైపు, లాహోర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ (AD) వ్యవస్థను భారత దళాలు ధ్వంసం చేశాయి. భారత డ్రోన్ దూసుకొస్తున్నా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమీ చేయలేకపోయింది. చైనా నుంచి పాకిస్థాన్ అధిక ధరకు కొనుగోలు చేసిన ఈ ఆయుధాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో పాటు, వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్థాన్ దళాలకు కొరవడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద మోహరించిన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా భారత్‌పై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించగా, భారత S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకొని నాశనం చేసింది. అంతేకాదు, జేఎఫ్-17 ఫైటర్ జెట్లను చైనా ఎంతో సమర్థవంతమైనవని చైనా చెప్పుకుంటుండగా... భారత్ పై ఆ యుద్ధ విమానాలను ఉపయోగించి పాక్ భంగపాటుకు గురైంది. నిన్న రాత్రి రెండు జేఎఫ్-17 ఫైటర్లను భారత్ కూల్చివేసింది. అవి గాల్లోకి లేచీ లేవడంతోనే భారత గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ఇంటర్ సెప్టర్ లను పంపించి పేల్చివేశాయి. ఈ ఘటనలు చైనా సైనిక పరికరాల విశ్వసనీయతపై చర్చకు దారితీయగా, పాక్ సైనికుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఈ వైఫల్యాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు చైనాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :