Saturday, 17 January 2026 09:03:09 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు ఫవాద్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి రూపాలి గంగూలీ ఫైర్

Date : 09 May 2025 12:56 PM Views : 206

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాకిస్థానీ నటుడు ఫవాద్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై భారత టెలివిజన్ నటి రూపాలి గంగూలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫవాద్‌ఖాన్ గతంలో భారతీయ చిత్రాల్లో నటించడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. అంతేకాదు, భారత ఓటీటీ వేదికలపై పాకిస్థానీ కంటెంట్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌ను ఉద్దేశిస్తూ ఫవాద్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఈ సిగ్గుచేటైన దాడిలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆప్తులకు ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రెచ్చగొట్టే మాటలతో మంటలు రేపడం ఆపండి. అమాయకుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. మంచి బుద్ధి ప్రసాదించు గాక. ఇన్షా అల్లా. పాకిస్థాన్ జిందాబాద్!" అని ఫవాద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఫవాద్‌ఖాన్ వ్యాఖ్యలపై నటి రూపాలి గంగూలీ తీవ్రంగా స్పందించారు. ఫవాద్ ఖాన్ వ్యాఖ్యల ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేస్తూ "మీరు భారతీయ సినిమాల్లో పనిచేయడం కూడా మాకు 'సిగ్గుచేటు'" అని రూపాలి ఘాటుగా బదులిచ్చారు. #OperationSindoor, #IndianArmy, #IndianAirForce వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఆమె తన పోస్ట్‌కు జోడించారు. రూపాలి గతంలో ఫవాద్‌ఖాన్ నటించిన 'ఖూబ్‌సూరత్', 'కపూర్ & సన్స్', 'యే దిల్ హై ముష్కిల్' వంటి భారతీయ చిత్రాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు. ఓటీటీలలో పాక్ కంటెంట్ నిషేధంపై రూపాలి హర్షం ఇటీవల, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ భారత ఓటీటీ వేదికలపై పాకిస్థాన్‌కు చెందిన అన్ని రకాల పాటలు, సినిమాలు, సిరీస్‌లు, పాడ్‌కాస్ట్‌ల ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. "జాతీయ భద్రత దృష్ట్యా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, మధ్యవర్తులు తక్షణమే పాకిస్థాన్‌కు చెందిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర స్ట్రీమింగ్ మీడియా కంటెంట్‌ను నిలిపివేయాలి" అని మంత్రిత్వ శాఖ నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని రూపాలి గంగూలీ స్వాగతించారు. "ఉద్రిక్తతల సమయంలో మన డిజిటల్ సరిహద్దులను కాపాడుకోవాలి. పాక్ స్ట్రీమింగ్ కంటెంట్‌ను నిషేధించిన మోదీ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్!" అని రూపాలి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా, ఫవాద్‌ఖాన్ 'అబీర్ గులాల్' అనే భారతీయ చిత్రంతో తిరిగి బాలీవుడ్‌లో కనిపించాల్సి ఉంది. అయితే, ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ చిత్రం వాస్తవానికి నేడు థియేటర్లలో విడుదల కావాల్సి ఉండేది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :