Studio18 News - అంతర్జాతీయం / : పాకిస్తాన్ క్రికెట్ జట్టు అనిశ్చితికి మారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జట్టు అభిమానులకు సైతం అంతు పట్టదు. ఓ మ్యాచ్లో అద్భుత ఆటతీరుతో అలరిసే ఆ వెంటనే మరుసటి మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేయడం చూస్తూనే ఉన్నాం. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023, వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024లతో పాటు ఇటీవల ముగిసిన ఛాంయన్స్ ట్రోఫీ 2025లోనూ ఆ జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించింది. దీంతో ఆ జట్టు పై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం వల్ల భారీగా నష్టపోయినట్లు వార్తలు వస్తుండగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఒకరు తాను కొన్న బ్యాట్లకు డబ్బులు ఇవ్వలేదట. పాపం సదరు షాప్ యజమాని సంవత్సర కాలంగా డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Admin
Studio18 News