Thursday, 15 May 2025 03:03:54 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

israel - Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి .. 130 మందికిపైగా మృతి

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు అంగీకరించని హమాస్

Date : 18 March 2025 10:15 AM Views : 55

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గాజాపై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్, ఐఎస్ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించుటకు హమాస్ అంగీకరించని కారణంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ చెరలో ఉన్న 30 మందికిపైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ఆ చర్చలు జరగలేదు. తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించగా, టెల్ అవీవ్ అంగీకరించింది. కానీ హమాస్ నిరాకరించింది. దీంతో హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముందుగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తాజాగా వైమానిక దాడి చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :