Studio18 News - టెక్నాలజీ / : Best 5G Phones India 2025 : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక కొత్త బ్రాండ్ల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది తెలుసుకోవడం కష్టమే. దాదాపు అన్ని ఫోన్లలో మంచి ఫీచర్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులకు నచ్చిన ఫోన్ ఎంచుకోవడంలో గందరగోళంగా ఉండొచ్చు.
అద్భుతమైన కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, స్పీడ్ ఛార్జింగ్ వంటి ఆప్షన్లు కలిగిన ఫోన్ల కోసం మీరు కూడా చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ఇటీవలే కొత్తగా లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 3a సహా మూడు ఇతర అద్భుతమైన మోడల్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ మార్చి నెలలో రూ. 25వేల లోపు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
వన్ప్లస్ నార్డ్ CE4 5జీ : వన్ప్లస్ నార్డ్ సీఈ 4 మోడల్ గత మోడల్ ఫోన్ కన్నా భారీ అప్గ్రేడ్లను కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడిన 120Hz అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంది. మీ ఫోన్ స్క్రీన్పై చేతులు తడిగా ఉన్నప్పుడు వేగంగా పనిచేస్తుంది. భారీ 5,500mAh బ్యాటరీతో మీ ఫోన్ను రోజంతా వాడుకోవచ్చు. రీఛార్జ్ చేసేందుకు 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండగా కేవలం 30 నిమిషాల్లో రీఛార్జ్ అవుతుంది. 50ఎంపీ సోనీ (LYT600) సెన్సార్ కెమెరా సిస్టమ్, వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీయొచ్చు.
Admin
Studio18 News