Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది రష్మిక మందన్నా. ఆమె నటించిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇప్పటికే యానిమల్, ఛావా, పుష్ప 2 చిత్రాలు థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతేకాదు ఆమె నటించిన చిత్రాలన్నీ రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి.
ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్ అంటే రష్మిక మందన్నా. ఇన్నాళ్లు దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుకుపోయిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటుతుంది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్ట్ అయిన ఆమ సినీప్రయాణం.. ఇప్పుడు విజయ శిఖరాలకు చేరుకుంది. వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న రష్మిక.. ఇప్పుడు సరికొత్త ఘనత సాధించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా. రష్మిక మందన్న చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ మూడు సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల క్లబ్లోకి ప్రవేశించాయి. దీనితో రష్మిక పేరు మీద ఒక రికార్డు వచ్చేసింది. మరే ఏ హీరోయిన్ సైతం వరుసగా మూడు సినిమాలు రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరలేదు.
Admin
Studio18 News