Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Gopal Varma : 2018 చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలో మెజిస్ట్రేట్ కోర్టు తనకు విధించిన 3 నెలల జైలు శిక్షను నిలిపివేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన అదనపు సెషన్స్ జడ్జి.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అయితే, వర్మ కోర్టుకు హాజరై బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. హార్డ్ డిస్క్ లు సరఫరా చేసే ‘శ్రీ’ అనే సంస్థ 2018లో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు వచ్చింది. శ్రీ.. వర్మ కంపెనీకి 2.38 లక్షల విలువైన హార్డ్ డిస్క్లను సరఫరా చేసింది. 2018 జూన్ 1న దానికి సంబంధించి చెక్ ఇచ్చాడు వర్మ. అయితే, తగినంత నిధులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయింది. ఆ తర్వాత వర్మ మరో చెక్కు జారీ చేశాడు. అది కూడా బౌన్స్ అయింది. దాంతో శ్రీ సంస్థ వర్మపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది.
Admin
Studio18 News