Thursday, 22 May 2025 02:32:44 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

ఏడాదిలో రూ. 40ల‌క్ష‌లు ఆర్జించిన పానీపూరీ వ్యక్తి.. జీఎస్‌టీ నోటీసుల‌తో నెట్టింట చ‌ర్చ‌!

త‌మిళ‌నాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి జీఎస్‌టీ నోటీసులు

Date : 05 January 2025 09:41 AM Views : 103

Studio18 News - బిజినెస్‌ / : మ‌న ద‌గ్గ‌ర స్ట్రీట్ ఫుడ్ పానీపూరీకి ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ మూలన చిన్న కొట్టుపెట్టిన కూడా జ‌నాలు క్యూ క‌డుతుంటారు. గిరాకీకి త‌గ్గ‌ట్టుగానే పానీపూరీ వ్యాపారులు డ‌బ్బులు ఆర్జిస్తుంటారు. అయితే, త‌మిళ‌నాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి జీఎస్‌టీ నోటీసులు రావ‌డంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. స‌ద‌రు వ్యాపారికి 2023-24లో రూ. 40ల‌క్ష‌ల ఆన్‌లైన్ పేమెంట్స్ వ‌చ్చిన‌ట్టు గుర్తించిన‌ క‌మిష‌న్ ప‌న్ను చెల్లించాల‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. 2024 డిసెంబర్ 17న తమిళనాడు వస్తువులు, సేవల పన్ను చట్టం మరియు కేంద్ర జీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 70 కింద అత‌నికి సమన్లు జారీ చేశారు. పానీపూరీ విక్రేత వ్యక్తిగతంగా హాజరు కావాలని, అవసరమైన పత్రాలను సమీక్ష కోసం సమర్పించాలని నోటీసులో పేర్కొన‌డం జ‌రిగింది. దీనికోసం అత‌ని 2022, 2023 లావాదేవీల‌ను అధికారులు విశ్లేషించిన‌ట్టు తెలుస్తోంది. క‌స్ట‌మ‌ర్లు యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు చేయ‌డంతో ఇది బ‌య‌ట‌ప‌డింది. ఈ వ్య‌వ‌హ‌రంపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ జరుగుతోంది. నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. "ఇది చాలా మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ప‌నిచేస్తున్న ప్రొఫెస‌ర్ల జీతం కంటే ఎక్కువ" అని ఒక‌రు, "ఒక్క డిజిట‌ల్ చెల్లింపుల ద్వారానే ఇంత ఆర్జించాడంటే.. న‌గ‌దు రూపంలో వ‌చ్చిన డబ్బు మాట ఏంటి?. అత‌ని వార్షిక ఆదాయం చాలా ఎక్కువ‌" అని మ‌రొక‌రు, "ఈ వార్త నెట్టింట‌ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. భవిష్యత్తులో ఎవరూ యూపీఐ చెల్లింపులను అంగీకరించరు" అని ఇంకొక‌రు కామెంట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :