Wednesday, 26 March 2025 04:15:36 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

స్కూలు వద్ద 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కాల్పులు..

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లో ఘటన బాలికకు గతేడాదే వివాహం అదనపు కట్నం కోసం అత్తమామల వేధింపులు భరించలేక కొన్ని నెలల క్రితం పుట్టింటికి కిడ్నాప్ వారిపనేనన్

Date : 26 December 2024 02:34 PM Views : 160

Studio18 News - క్రైమ్ / : రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలో పట్టపగలు ఓ స్కూలు విద్యార్థిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. సుమోలో వచ్చిన ముగ్గురు నలుగురు కిడ్నాపర్లు బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో స్థానికులను భయపెట్టేందుకు కాల్పులు జరిపారు. బాలికకు గతేడాదే వివాహమైందని, కట్నం కోసం అత్తమామలు వేధించడంతో తిరిగి ఇంటికి వచ్చేసిందని బాలిక తండ్రి తెలిపారు. ఈ కిడ్నాప్ వెనక వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కారులో వచ్చిన నిందితులు తుపాకి గురిపెట్టి మరీ బాలికను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వారిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఇది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలకు కారణమైంది. ముఖ్యమంత్రి మోహన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. బాలిక స్కూలు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెకు సమీపంలో ఓ సుమో వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా లాక్కెళ్లారు. చుట్టూ ఉన్నవారు ఈ ఘటనను చూసి అప్రమత్తమై వారిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితులు హెచ్చరికగా కాల్పులు జరపడంతో వారు వెనక్కి తగ్గారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాలిక భర్త, బావమరిది, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపులు భరించలేక తిరిగి ఇంటికి వచ్చిన బాలిక చదువు కొనసాగిస్తోందని, అయినప్పటికీ కట్నం కోసం అత్తమామలు ఇంకా వేధిస్తూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ల కోసం మూడు బృందాలను రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు.

Also Read : సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంటుంది... సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :