Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక మందన్న జంటగా వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్తో మూవీ అదరగొడుతోంది. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మూడేళ్ల తర్వాత బన్నీ సినిమా రావడం, అందులోనూ క్రేజీ సీక్వెల్ కావడంతో సినీ అభిమానులు పుష్ప 2 థియేటర్లకు పోటెత్తుతున్నారు. హిట్ టాక్ రావడంతో రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని సినిమా చూసిన వారు చెబుతున్నమాట. కాగా, ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత తమ ప్లాట్ఫామ్పై ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్ఫ్లిక్స్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.
Also Read : పీడీఎస్ బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు: మంత్రి నాదెండ్ల
Admin
Studio18 News