Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కన్నడ స్టార్ హీరోలలో ధృవ సర్జా ఒకరు. 2012లోనే ఆయన తన కెరియర్ ను మొదలెట్టాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'పొగరు' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన 'మార్టిన్' సినిమా చేశాడు. ఏపీ అర్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ధ్రువ సర్జా ఎవరో కాదు, యాక్షన్ కింగ్ అర్జున్ కి మేనల్లుడు. అర్జున్ కి కథ .. స్క్రీన్ ప్లే - దర్శకత్వ విభాగాలపై మంచి పట్టు ఉంది. అందువలన ఆయన తన మేనల్లుడి కోసం ఒక మంచి కథను రెడీ చేసి ఇచ్చాడు. ఆ కథతో రూపొందిన సినిమానే ఇది. టీజర్ .. ట్రైలర్ తో ఈ సినిమా ఒక్కసారిగా హైప్ తెచ్చుకుంది. అందరూ కూడా 'కేజీఎఫ్' తో పోలుస్తూ మాట్లాడుకున్నారు. అలాంటి ఈ సినిమా దసరా సందర్భంలో అక్టోబర్ 11వ తేదీన విడుదలైంది. 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేశారు. అయితే ఈ భాషలన్నిటిలో కలుపుకుని ఈ సినిమా 25 కోట్లను మాత్రమే వసూలు చేసిందని టాక్. వైభవి శాండిల్య కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు 41ఏ నోటీసులు
Admin
Studio18 News