Monday, 17 March 2025 04:24:35 PM
# Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను

ట్రంప్ గెలవడంతో ఎక్స్ కు గుడ్ బై చెబుతున్న లక్షలాదిమంది యూజర్లు

మరో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘బ్లూస్కై’లో చేరుతున్న వైనం విషపూరితమైన వేదిక అంటూ ‘ఎక్స్’ పై విమర్శలు ట్రంప్ విజయం కోసం ఎక్స్ అధినేత ఎలాన్ మస్

Date : 16 November 2024 01:49 PM Views : 72

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం చాలా వాటిపై పడుతోంది. ట్రంప్ గెలవడం జీర్ణించుకోలేని మహిళలు చాలామంది తమ ప్రియుడు, భర్తలపై మండిపడుతున్నారు. కొంతమంది అమెరికన్లు దేశం విడిచిపెట్టి వెళుతుండగా.. మరికొందరు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ పైనా ట్రంప్ ఎఫెక్ట్ పడింది. డొనాల్డ్ ట్రంప్ కు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మద్దతు పలకడం, ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేయడంతో పాటు ‘ఎక్స్’ లోనూ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మండిపడుతున్న యూజర్లు ‘ఎక్స్’ కు గుడ్ బై చెబుతున్నారు. ఇదొక విషపూరితమైన ప్లాట్ ఫాం అంటూ ‘ఎక్స్’ ను వీడుతున్నారు. రోజూ లక్షలాది మంది తమ ఖాతాలను తొలగించుకుంటున్నారని సమాచారం. వీరంతా ‘బ్లూస్కై’ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దాని పేరును ‘ఎక్స్’ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ పూర్తికాక ముందు ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే వ్యవహరించారు. ట్విట్టర్ ను టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లడంలో డోర్సే కృషి ఎంతో ఉంది. అయితే, ట్విట్టర్ పగ్గాలు తన చేతికి వచ్చాక డోర్సేను మస్క్ తొలగించాడు. దీంతో 2019లో జాక్ డోర్సే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ‘బ్లూస్కై’ ని తీసుకొచ్చారు. దాదాపు ఐదేళ్లు ‘బ్లూస్కై’ ని డెవలప్ చేసిన డోర్సే ఇటీవలే అందులో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ‘బ్లూస్కై’ కి జే గ్రాబర్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

Also Read : వేలేరుపాడు పీఎస్ లో బోరుగడ్డ అనిల్ ను విచారిస్తున్న పోలీసులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :