Sunday, 15 March 2026 10:51:22 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Rashmika Mandanna : తన డీప్ ఫేక్ వీడియోని ప్రస్తావిస్తూ.. సైబర్ క్రైమ్స్‌కి వ్యతిరేకంగా పోరాటం..

Date : 15 October 2024 01:28 PM Views : 298

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ కూడా చేసారు. అయితే తాజాగా రష్మిక మందన్నని ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్(I4C)కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. కొన్నాళ్ల క్రితం నా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది సైబర్ క్రైమ్. అది జరిగిన తర్వాత నేను సైబర్ క్రైమ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలి అనుకున్నాను. అందరికి దీనిపై అవగాహన కలిగించాలి అనుకున్నాను. ఈ క్రమంలో భారత ప్రభుత్వంతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను అని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సైబర్ క్రిమినల్స్ అందర్నీ టార్గెట్ చేస్తూ ఉంటారు. మనం అలర్ట్ గా ఉండటమే కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, అలాగే సైబర్ క్రైమ్స్ జరగకుండా పనిచేయాలి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచుతాను. దేశాన్ని సైబర్ క్రైమ్స్ నుంచి కాపాడాలి అని తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా రష్మిక ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కి బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు పలువురు అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు. తనకి జరిగింది ఇంకొకరికి జరగకుండా సైబర్ క్రైమ్స్ పై అవగాహన పెంచడానికి రష్మిక ముందుకొచ్చినందుకు ఆమెని అభినందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :