Monday, 28 April 2025 05:03:53 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Naim Kassem: నస్రల్లాను మించిన నయీమ్ ఖాసిమ్... ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు

Date : 09 October 2024 12:11 PM Views : 62

Studio18 News - అంతర్జాతీయం / : ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ హిజ్బూల్లా తమ శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా ఆ సంస్థ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నయీమ్ ఖాసిమ్ ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, వారంతా నిరాశ్రయులు కావడం తప్పదని హెచ్చరించాడు. అగ్రనేతల మృతితో హిజ్బుల్లా నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ తరపున ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖాసిమ్ ఎవరనే చర్చ జరుగుతోంది. మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో హసన్ నస్రల్లా మాదిరిగానే నయీమ్ ఖాసిమ్ ఒకరు. అయితే, నస్రల్లా అంతటి చరిష్మా, వాగ్దాటి ఆయనకు లేవు. తెలుపు రంగు తలపాగా చుట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు. ఇంతకు ముందు నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భంలోనూ సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నస్రల్లా కంటే ఖాసిమ్ తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆయన బహిరంగ ప్రకటనలు చూస్తే అర్థమవుతుందని ఆ సంస్థ కార్యకలాపాలపై పరిశోధనలు చేసే కార్నెగీ మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధి మొహనద్ అలీ చెప్పుకొచ్చారు. నస్రల్లా మృతి తర్వాత ఆయన దగ్గరి బంధువు హషేమ్ సఫీద్దీన్‌ ఆ బాధ్యతలు చేపడతారని భావించారు. కానీ, నస్రల్లా మరణం తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఖాసిమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరో పక్క హిజ్బూల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్న అమెరికా ఖాసిమ్ పైనా ఆంక్షలు విధించింది. ఖాసిమ్ దక్షిణ లెబనాన్ లోని కఫర్ ఫిలాలో జన్మించాడు. స్థానిక యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన అనంతరం రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మతపరమైన విద్యను అభ్యసించిన ఖాసిమ్ .. విద్యార్ధులకూ బోధించే వాడు. ఇందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1970లో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో మిలిటెంట్ సంస్థ తరపున చేరాడు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ సమయంలో ఏర్పడిన హిజ్బూల్లాలో చేరాడు. 1991 నుంచి ఆ సంస్థకు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :