Saturday, 26 April 2025 07:20:04 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Israel-Iran Conflict: ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..

Date : 04 October 2024 03:38 PM Views : 114

Studio18 News - అంతర్జాతీయం / : Israel-Iran War: ఇజ్రాయెల్ – ఇరాన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉధ్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ సముద్రం గుండా షిప్పింగ్ మార్గం అందుబాటులోకి రాకపోవచ్చు. తద్వారా సరుకు రవాణా, ఇతర వస్తువుల ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారతదేశం చమురు, గ్యాస్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అధిక ధరలు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు పెరుగుతన్నప్పటికీ.. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారతదేశం కూడా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది. భారతదేశం ఆగస్టు దిగుమతుల్లో రష్యా చమురు వాటా వరుసగా ఐదు నెలలు పెరిగిన తరువాత సుమారు 36శాతంకు తగ్గింది. జూలైలో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా చమురు వాటా 44శాతం. భారతదేశం క్రూడ్ దిగుమతుల్లో మధ్యప్రాచ్య చమురు వాటా జూలైలో 40.3శాతం నుంచి 44.6శాతంకు పెరిగింది. ఏప్రిల్ – ఆగస్టులో ఈ ప్రాంతం యొక్క వాటా ఏడాది క్రితం 46శాతం నుంచి 44శాతంకు క్షీణించింది. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ భారతదేశానికి ప్రధాన మధ్యప్రాచ్య చమురు సరఫరాదారులుగా ఉన్నాయి. మరోవైపు.. భారతదేశం ఖాతర్ నుంచి ద్రవ రూప సహజ వాయువు (ఎల్ఎన్జీ)ని దిగుమతి చేసుకుంటుంది. ఎల్ఎన్జీ దిగుమతులను మరో 20ఏళ్లు పొడిగించేందుకు ఫిబ్రవరిలో ఖాతర్ తో 78 బిలియన్ డాలర్ల ఒప్పందంను భారత్ కుదుర్చుకుంది. భారతదేశం రష్యా నుంచి ఎర్ర సముద్రం ద్వారా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం తలెత్తితే.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ( కేప్ ద్వీపకల్పం) ద్వారా సరుకులను మళ్లించడం. అంతేకాకుండా ఖాతర్ నుంచి భారత్ దేశం ఎల్ఎన్జీని, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి చమురును హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా చేయడం మరో సవాలు కావచ్చు. ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న హోర్ముజ్.. పెర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. హార్ముజ్ ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు చోక్ పాయింట్. ఎందుకంటే ఈ జలసంధి ద్వారా భారీగా చమురును రవాణా జరుగుతుంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు 2022 నుంచి 2023 మొదటి అర్ధభాగంలో మొత్తం హార్ముజ్ నుంచి ముడి చమురు, ఇతర వస్తువుల రవాణాపై 67శాతం వాటాను కలిగి ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఆసియాకు తరలిస్తున్న ముడి చమురులో చమురు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో భారతదేశానిదే అగ్రస్థానం ఉంటుంది. అయితే, ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. ఇరాన్-ఇజ్రాయెల్ లేదా ప్రాక్సీ వివాదంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాలు తటస్థతలో ఉండటం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :