Monday, 17 February 2025 04:20:24 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Nasrallah Death: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా మృతదేహం స్వాధీనం.. శరీరంపై ఒక్క గాయం లేదు..! ఎలా మరణించాడంటే?

Date : 30 September 2024 11:47 AM Views : 44

Studio18 News - అంతర్జాతీయం / : Hezbollah Chief Nasrallah: లెబనాన్ రాజధాని బీరూట్ లోని దాహియా ప్రాంతంలోఉన్న హెజ్‌బొల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బంది దాడి జరిగిన ప్రదేశంలోనే నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో.. అసలు నస్రల్లా మృతికి ఇజ్రాయెల్ దాడులే కారణమా.. అంతకు ముందే మరణించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భారీ బాంబు పేలుళ్ల కారణంగా షాక్ కు గురై నస్రల్లా చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ కు లెబనీస్ భద్రత, వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని చెప్పారు. బాంబు పేలుళ్ల సమయంలో భారీ శబ్దం వచ్చిన సమయంలో అతను షాక్ కు గురై మరణించి ఉంటాడని వారు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. హెజ్‌బొల్లా చీఫ్ మరణం తరువాత ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్-సుడానీ దేశంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. నస్రల్లా మరణం తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ దూకుడుతో హెజ్‌బొల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న తరుణంలో ఈ పోరులో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ తో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ఉన్నత స్థాయి అధికారిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దానికి సంబంధించిన అనుమతులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. 1981 మాదిరిగానే ఇజ్రాయెల్ తో పోరాడేందుకు లెబనాన్ కు బలగాలను పంపుతామని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపిన వివరాల ప్రకారం.. హసన్ నస్రల్లా దాక్కున్న హెజ్‌బొల్లా భూగర్భ కార్యాయలం యూఎన్ పాఠశాలకు కేవలం 53 మీటర్ల దూరంలోనే ఉందట. లెబనాన్ లోని బీరూట్ లో ఉన్న ఈ స్థలం నివాస ప్రాంతంలో ఉంది. ఇక్కడ సామాన్య ప్రజలు నివసిస్తున్నారు. అయితే, నస్రల్లా, ఆయనతోపాటు అనేక మంది కమాండర్లు భూగర్భంలోని భవనాల్లో దాక్కున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :