Thursday, 12 March 2026 03:31:12 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Lebanon: లెబనాన్ లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ బలగాలు!

Date : 26 September 2024 12:13 PM Views : 336

Studio18 News - అంతర్జాతీయం / : లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల పాటు వైమానిక దాడులు చేసి హిజ్బుల్లా కీలక నేతలు సహా వందలాది మందిని మట్టుబెట్టింది. అయినప్పటికీ హిజ్బుల్లా దాడులు ఆగకపోవడంతో గ్రౌండ్ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ తన బలగాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఐడీఎఫ్ బలగాలు లెబనాన్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేసింది. గడిచిన మూడు రోజుల్లో లెబనాన్ లోని 2 వేలకు పైగా హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెడతామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన హిజ్బుల్లా కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయంపైకి బుధవారం బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించినట్లు హిజ్బుల్లా వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయెల్- హిజ్బుల్లా యుద్ధంపై అమెరికా రక్షణశాఖ స్పందించింది. లెబనాన్ పై గ్రౌండ్ అటాక్ చేయాలన్న నిర్ణయం అంత మంచిది కాదని పేర్కొంది. అయితే, మధ్య ప్రాచ్యంలో ఆల్ ఔట్ వార్ జరిగే అవకాశం లేకపోలేదంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. లెబనాన్ లో దాడులను వెంటనే ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందిస్తూ.. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ ఇజ్రాయెల్ పై మండిపడింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :