Saturday, 22 March 2025 07:30:46 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు ప్రధాని మోదీ.. జెలెన్‌స్కీతో మరోసారి భేటీ.. ఎందుకో తెలుసా?

Date : 24 September 2024 10:47 AM Views : 70

Studio18 News - అంతర్జాతీయం / : PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మూడ్రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో ఆయన భారత్ కు బయలుదేరారు. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భారత దేశానికి బయలుదేరారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ క్వాడ్ దేశాధినేతల సమ్మిట్ కు హాజరయ్యారు. న్యూయార్క్ లోని భారతీయ ప్రవాసులతో ‘మోదీ అండ్ యూఎస్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ‘సమ్మిట్ ఆఫ్ ది ప్యూచర్’లో మోదీ ప్రసంగించారు. దీంతోపాటు తన పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూడ్ అబ్బాస్ తో జరిగిన సమావేశాలతో సహా కీలక ద్వైపాక్షిక సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. న్యూయార్క్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు నేపాల్, కువైట్, వియాత్నాం, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోదీ సోమవారం న్యూయార్క్ లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం కావటం విశేషం. ప్రధాని మోదీ ఈ ఏడాది ఆగస్టు 23న ఉక్రెయిన్ ను సందర్శించారు. ఉక్రెయిన్ లో శాంతిని త్వరగా తిరిగి పునరుద్దరించడానికి సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించాలని భారతదేశం సహకారాన్ని జెలెన్ స్కీ ప్రధాని మోదీని కోరారు. ప్రధాని మోదీ, జెలెన్ స్కీ సమావేశం గురించి విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ సమావేశం ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్ధన మేరకు జరిగింది. గత మూడు నెలల్లో ఇరువురు నేతలు భేటీ కావడం ఇది మూడోసారి. ఇరు దేశాల అధినేతలు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో రష్యా చమురుపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :