Sunday, 25 January 2026 05:54:51 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

వెంటాడి వేటాడి హెజ్బొల్లాను ఖతం చేసే పనిలో ఇజ్రాయల్..

Date : 24 September 2024 10:29 AM Views : 263

Studio18 News - అంతర్జాతీయం / : Israel Hezbollah War : లెబనాన్ లో హెజ్బొల్లాను వెంటాడి వేటాడి ఖతం చేసే పనిలో ఉంది ఇజ్రాయల్. హెజ్బొల్లాను ఒక అడుగు వేసితే, ఇజ్రాయల్ 100 అడుగులు ముందుకు వేస్తోంది. హెజ్ బొల్లా తొడ కొడితే.. ఇజ్రాయల్ మెడ తీసేస్తామంటోంది. ఓ రకంగా హెజ్బొల్లా వెన్నులో వణుకుపుట్టేలా ఇజ్రాయల్ విజృంభిస్తోంది. టాప్ రేంజ్ కమాండర్ స్థాయి అధికారులే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలువురు హెజ్బొల్లా కమాండర్లను ఖతం చేసింది. ఇప్పుడు నెంబర్ 2 గా ఉన్న ఇబ్రహీం అకీల్ ని లేపేసింది. 300 హెజ్బొల్లా స్థావరాలపై భీకర దాడులతో మరణ మృదంగం మోగిస్తోంది ఇజ్రాయల్. ఎక్కడ నక్కినా, ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ప్లాన్ చేద్దామని స్కెచ్ వేసినా.. వెంటనే హెజ్బొల్లాకు చావుని పరిచయం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ వేటలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తోంది. ఇప్పటికే హెజ్బొల్లాలో టాప్ కమాండర్లుగా ఉన్న వాళ్లను వన్ బై వన్ లేపేస్తూ వచ్చింది. ఇక నెక్ట్స్ టార్గెట్.. హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లానే. దీంతో ఆ గ్రూపులో దడ పుడుతోంది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రం కావడంతో భారత బలగాలు అలర్ట్ అయ్యాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ మిషన్ లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయల్-లెబనాల్ బోర్డర్ లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారిండచం వీరి బాధ్యత. తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :