Friday, 18 July 2025 07:04:24 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Indian: స్టార్ హోట‌ల్ ఎంట్ర‌న్స్‌ లోనే మ‌ల‌విస‌ర్జ‌న‌.. భార‌తీయ కార్మికుడికి రూ.25 వేల జ‌రిమానా!

Date : 20 September 2024 11:54 AM Views : 165

Studio18 News - అంతర్జాతీయం / : సింగ‌పూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో ఓ భార‌తీయ కార్మికుడు హోట‌ల్ ఎంట్ర‌న్స్‌లోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. ఈ వ్య‌వ‌హారాన్ని తాజాగా విచారించిన కోర్టు అత‌డిని దోషిగా నిర్ధారించింది. అనంత‌రం కోర్టు అత‌డికి 400 సింగ‌పూర్ డాల‌ర్లు (భార‌తీయ క‌రెన్సీలో రూ.25వేలు) జ‌రిమానా విధించింది. వివ‌రాల్లోకి వెళితే.. వ‌ర్క్ ప‌ర్మిట్‌పై సింగ‌పూర్‌లో ఉంటున్న‌ భార‌త్‌కు చెందిన రాము చిన్న‌రాసా అనే కార్మికుడు గ‌తేడాది మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్క‌డ త‌ప్ప‌తాగి క్యాసినోకు వెళ్లాడు. కొద్దిసేపు క్యాసినో ఆడిన అత‌డు.. బాత్‌రూమ్‌కు వెళ్లాల‌నుకున్నాడు. కానీ, మ‌ద్యం మ‌త్తులో బాత్‌రూమ్‌కు వెళ్లే దారి తెలియ‌క హోట‌ల్ ఎంట్ర‌న్స్‌లోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఇది గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రామును గుర్తించి ప్ర‌జారోగ్య నిబంధ‌న‌ల కింద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 2023 అక్టోబ‌ర్ 30న జ‌రిగిన ఈ ఘ‌ట‌న తాలూకు ఫొటో అప్ప‌ట్లో బాగా వైర‌ల్ అయింది. ఇక ఈ ఏడాది జూన్ 4న రాము మ‌రోసారి అదే హోట‌ల్‌కు వెళ్లాడు. వెంట‌నే గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో హోట‌ల్‌కు వ‌చ్చిన‌ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో రాము త‌న నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని తీవ్రంగా మంద‌లించిన జ‌డ్జి.. రూ.25వేల జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :