Sunday, 08 March 2026 03:56:27 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

sunita williams: సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏం చేస్తుందో తెలుసా?

Date : 17 September 2024 02:35 PM Views : 367

Studio18 News - అంతర్జాతీయం / : Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ లను భూమిపైకి తిరిగి తీసుకురావడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో స్పేస్-ఎక్స్ కు చెందిన క్రూ-9 మిషన్ నుండి వారిని తిరిగి తీసుకువస్తామని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాసాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు దీనికి సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి నాసా యొక్క నిక్ హేగ్, రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ క్రూ-9 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి వెళ్లే ముందు నిర్బందంలో ఉంటారు. నాసా విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా.. సెప్టెంబర్ 26న స్పేస్-ఎక్స్ సహాయంతో క్రూ-9 మిషన్ ను ప్రయోగించనున్నట్లు తెలిసింది. నాసా నిక్ హేగ్, కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవోలను ప్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ -ఎక్స్ యొక్క ఫాల్కన్-9 రాకెట్ సహాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. భారత కాలమానం ప్రకారం.. క్రూ-9 మిషన్ సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 11.58గంటలకు ప్రారంభవుతుందని నాసా తెలిపింది. ప్రయోగించిన ఆరు గంటల తరువాత ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు. సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష నౌక నుంచి ఐఎస్ఎస్ కి పంపబడతారు. అయితే, ఈసారి క్రూ-9 మిషన్ ద్వారా కేవలం ఇద్దరు వ్యోమగాములను మాత్రమే ఐఎస్ఎస్ కు పంపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో క్రూ-9 మిషన్ తిరిగి భూమికి తిరిగి రానుంది. అందులో ఇద్దరు వ్యోమగాముల ద్వారా.. సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ కూడా భూమికి తిరిగి రానున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :