Sunday, 16 March 2025 02:34:55 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ రాకపై కీలక ప్రకటన చేయనున్న నాసా!

Date : 24 July 2024 05:12 PM Views : 254

Studio18 News - టెక్నాలజీ / : Sunita Williams : బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి అడుగుపెట్టిన ఇద్దరు వ్యోమగాములు అక్కడే ఉండిపోయారు. వ్యోమనౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె భాగస్వామి బుచ్ విల్మోర్‌ ఐఎస్ఎస్‌లో చిక్కుకున్నారు. దాంతో వారిద్దరూ అంతరిక్షం నుంచి భూమిపైకి రావడం ఆలస్యమవుతుందని ఇప్పటికే నాసా వెల్లడించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయోగించిన తర్వాత ఇద్దరు వ్యోమగాములు జూన్ 6 నుంచి ఐఎస్ఎస్‌లోనే ఉన్నారు.వ్యోమనౌక థ్రస్టర్‌లో సాంకేతిక సమస్యతో వ్యోమగాములు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే, నాసా, బోయింగ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రాకపై కీలక ప్రకటన చేయనున్నాయి. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌గా పిలిచే ఈ మిషన్.. వ్యోమగాముల రాక ఆలస్యం కారణంగా అనేక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంది. టెస్టింగ్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ బృందాలు : ఇటీవలే, నాసా, బోయింగ్‌కు చెందిన ఇంజనీరింగ్ బృందాలు న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ టెస్ట్ ఫెసిలిటీలో స్టార్‌లైనర్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్ గ్రౌండ్ హాట్ ఫైర్ టెస్టింగ్‌ను పూర్తి చేశాయి. విలియమ్స్, విల్మోర్‌లు భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి ఈ టెస్ట్ సిరీస్ కీలకంగా చెప్పవచ్చు. ఈ టెస్టింగ్ నుంచి సేకరించిన డేటాను ప్రస్తుతం నాసా విశ్లేషిస్తోంది. రాబోయే ప్రకటనలో ప్రాథమిక ఫలితాలను చర్చించాలని నాసా భావిస్తోంది. ఐఎస్ఎస్‌కి వచ్చినప్పటి నుంచి విలియమ్స్, విల్మోర్‌లు ఎక్స్‌పెడిషన్ 71 సిబ్బందితో ఏకీకృతమై, శాస్త్రీయ పరిశోధనలు, అనేక ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మిషన్ స్టార్‌లైనర్ సిస్టమ్ ఎండ్-టు-ఎండ్ టెస్ట్‌గా పనిచేస్తుంది. ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం, వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడం, అమెరికన్ ప్రైవేట్ ఇండస్ట్రీతో భాగస్వామ్యం ద్వారా ఐఎస్ఎస్ యాక్సస్ విస్తరించడమే దిశగా నాసా ప్రయత్నాలు చేస్తోంది. తద్వారాడ శాస్త్రీయ పరిశోధన, కమర్షియల్ వెంచర్లు, అంతరిక్షంలో మానవ అన్వేషణ కోసం మరిన్ని అవకాశాలను తెరవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ కేవలం 7 రోజులు మాత్రమే ఉండేలా షెడ్యూల్ చేసింది. భూమికి తిరిగి ఎప్పుడు వస్తారంటే? : సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అనేదానిపై స్సష్టత లేదు. ప్రస్తుతం సేకరించిన డేటాను సమీక్షిస్తున్నామని, నాసా, బోయింగ్ తెలిపాయి. రాబోయే వారాల్లో ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరుగు పయనం అవుతారని నాసా, బోయింగ్ తెలిపాయి. స్టార్‌లైనర్ థ్రస్టర్‌ సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించే వరకు వ్యోమగాములు అక్కడే ఉండాల్సి వస్తుంది. మరో వారం పాటు ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోనే గడపబోతున్నారు. అందిన నివేదిక ప్రకారం.. వచ్చే ఆగస్టులోగా స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :