Wednesday, 30 April 2025 02:39:26 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొని 48మంది మృతి

Date : 09 September 2024 10:31 AM Views : 108

Studio18 News - అంతర్జాతీయం / : Nigeria : నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఇంధన ట్యాంకర్ ఢీకొనగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 48 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 50 మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. మంటల్లో చిక్కుకొని మృతదేహాలను గుర్తించలేని విధంగా కాలిపోయాయి. ఆదివారం సాయంత్రం ఉత్తర్ – మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర – మధ్య నైజర్ రాష్ట్రంలోని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా -అరబ్ మాట్లాడుతూ.. ప్రయాణికులు, పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదంలో అనేక ఇతర వాహనాలు కూడా దగ్దమయ్యాయని అన్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకోవటం జరిగింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించగా.. తొలుత 30 మృతదేహాలను గుర్తించడం జరిగిందని, ఆ తరువాత మరో 18మంది మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోవటం జరిగిందని బాబా-అరబ్ తెలిపారు. ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తంచేసిన నైజర్ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. నైజీరియాలో ట్రక్కు ప్రమాదాలు నిత్యం జరుగుతుంటాయి. సమర్ధవంతమైన రైల్వే వ్యవస్థ లేకపోవటంతో రోడ్డు మార్గంలో భారీగా సరుకు రవాణా జరుగుతుంది. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020లోనే నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ 1,531 ట్యాంకర్ ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. ఈ ప్రమాదాల్లో 535 మంది మరణించారు. మరో వెయ్యికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :