Tuesday, 29 April 2025 11:33:27 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Kashmir: ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్... వివరాలు ఇవిగో!

Date : 06 September 2024 11:50 AM Views : 255

Studio18 News - లైఫ్ స్టయిల్ / : దేశ, విదేశాల్లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించాలనుకునే ప్రాంతం కశ్మీర్. ఎందుకంటే .. అక్కడి అందమైన లోయలు, మంచు పర్వతాలు, ఎత్తయిన చెట్లు, వాతావరణం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. పర్యాటకుల స్వర్గధామంగా కశ్మీర్ ను పేర్కొంటుంటారు. సినిమాల్లో కనువిందు చేసే సుందర కశ్మీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించాలనుకునే పర్యాటక ప్రేమికుల కోసం ఐఆర్ సీటీసీ ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి ప్యారడైజ్ ఆన్ ఎర్త్ – కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది. బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లు చేసింది. పర్యాటకులు ఎటువంటి బడలిక లేకుండా చక్కగా విమానంలో వెళ్లి కశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు. ఆరు రోజుల అందమైన టూర్ ప్యాకేజీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..ఐదు రాత్రులు, ఆరు ఆరు రోజుల పర్యటన. ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుండి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లను భారతీయ రైల్వేకి అనుబంధ సంస్థ అయిన ఐఆర్ సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్) చేసింది. టూర్ లో భాగంగా శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్‌మార్గ్ తదితర అందమైన ప్రదేశాలను వీక్షించవచ్చు. అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్ వసతి, ప్రయాణానికి క్యాబ్ సేవలతో పాటు ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలోనే ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీ ధర: ఒక్కరే అయితే రూ.59,700లు ఖర్చు అవుతుంది. అయితే ఇద్దరు వ్యక్తులు కలిపి ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.47,900 మాత్రమే పడుతుంది. కశ్మీర్ ను చూడాలనుకునే వారు ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సై ట్ ను సందర్శించి, దానిలో బుక్ నౌ ఎంపికపై క్లిక్ చేస్తే ప్యాకేజీ వివరాలు కనిపిస్తాయి. మరింత సమాచారం కొరకు 90031 40699, 85959 31291 నంబర్‌లను సంప్రదించవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :