Friday, 14 November 2025 02:48:32 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

Brain Cancer Risk : మొబైల్ ఫోన్ల వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగదు : WHO క్లారిటీ ఇచ్చిందిగా..!

Date : 04 September 2024 05:19 PM Views : 171

Studio18 News - టెక్నాలజీ / : Brain Cancer Risk : ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అదో ఫోన్ ఇప్పుడు నిత్యవసరంగా మారింది. మరికొందరికి అదో వ్యసనంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ కలిగిన వారు రోజులో కనీసం ఒక క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. అంతగా మనిషి మనుగడకు ఫోన్ జీవనాధారంగా మారింది. మొబైల్ ఫోన్లలోని రేడియేషన్ కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు ఉందంటూ గతంలో అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, తాజాగా కొత్త అధ్యయనంలో అలాంటిది ఏమి ఉండదని తేల్చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అధ్యయనాన్ని సమర్థించింది. ఆరోగ్య సంస్థ నియమించిన కొత్త రివ్యూలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని మెదడు క్యాన్సర్ ప్రమాదానికి గురిచేసే ఆధారాలు ఏవీ గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనలను విశ్లేషించిన ఈ అధ్యయనంలో మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ టెక్నాలజీ విస్తృత వినియోగంతో బ్రెయిన్ క్యాన్సర్‌ ముప్పును పెంచదని తేల్చేశారు పరిశోధకులు. ఫోన్ల వాడకంతో క్యాన్సర్ ముప్పు : గత కొన్ని దశాబ్దాలుగా మొబైల్ ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫోన్ల వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే యూజర్లు దశాబ్ద కాలంగా వాటిని ఉపయోగిస్తున్న వారు కూడా ఇందులో ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఇటీవల ప్రచురించిన రివ్యూలో 1994, 2022 మధ్య నిర్వహించిన 63 అధ్యయనాలను పరిశీలించింది. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీ నుంచి నిపుణులతో సహా 10 దేశాల నుంచి 11 మంది పరిశోధకులు ఈ పరిశోధనను నిర్వహించారు. మొబైల్ ఫోన్‌లు, అలాగే టీవీలు, బేబీ మానిటర్లు, రాడార్ వంటి ఇతర డివైజ్‌లను ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ప్రభావాలపై రివ్యూ చేశారు. ప్రొఫెసర్ మార్క్ ఎల్వుడ్, అధ్యయనం సహ-రచయిత, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్శిటీ క్యాన్సర్ ఎపిడెమియాలజీలో నిపుణుడు ఇదే విషయాన్ని వెల్లడించారు. బ్రెయిన్ క్యాన్సర్ ముప్పును పెంచే ఆధారాలేమి కనిపించలేదని స్పష్టం చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు మెదడు క్యాన్సర్‌తో పాటు పిట్యూటరీ గ్రంధి, లాలాజల గ్రంథులు, లుకేమియా క్యాన్సర్‌లతో సహా వివిధ రకాల క్యాన్సర్‌లను ఈ అధ్యయనం పరిశీలించింది. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగం, బేస్ స్టేషన్లు, ట్రాన్స్‌మిటర్‌లు, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు వృత్తిపరమైన బహిర్గతం వంటి వాటితో సంబంధం ఉన్న నష్టాలను పరిగణించారు. ఇతర క్యాన్సర్ రకాలు ప్రత్యేక నివేదికలో వెల్లడించనున్నారు. మొబైల్ ఫోన్ వినియోగం, క్యాన్సర్ మధ్య ఎలాంటి కచ్చితమైన సంబంధాన్ని కనుగొనలేదని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ, ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే రేడియేషన్ నుంచి హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు కచ్చితమైన ఆధారాలు లేవని గతంలో పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అనేది పర్యవేక్షించడానికి పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను “కార్సినోజెనిక్” లేదా క్లాస్ 2బీగా వర్గీకరిస్తుంది. 2011లో చివరి అసెస్‌మెంట్ నుంచి కొత్త డేటా ఇచ్చింది. ఈ వర్గీకరణను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఏజెన్సీ సలహా బృందం సిఫార్సు చేసింది. డబ్ల్యూహెచ్ఓ రివీల్ చేసిన అధ్యయనానికి సంబంధించి సమాచారం వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్ వినియోగంతో రాబోయే రోజుల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రభావం ఎంతవరకు ప్రభావం ఉంటుందో లేదో స్సష్టత రానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :