Wednesday, 30 April 2025 09:48:11 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Ukraine: ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణి దాడి.. 51 మంది మృతి!

Date : 04 September 2024 02:38 PM Views : 167

Studio18 News - అంతర్జాతీయం / : ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డింది. తాజాగా ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. పోల్టావాలో ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యన్ ద‌ళాలు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తనకు సమాచారం అందిందని అన్నారు. ఇక ఈ దాడి కార‌ణంగా టెలికమ్యూనికేషన్స్ ఇనిస్టిట్యూట్ భవనాలలో ఒకటి పాక్షికంగా ధ్వంసం అయిన‌ట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు. "పోల్టావాలో రష్యా దాడిపై నాకు ప్రాథమిక నివేదికలు అందాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి" అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే మృతుల‌కు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. అటు పోల్టావా రీజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్‌ ఫిలిప్ ప్రోనిన్ టెలిగ్రామ్ ద్వారా తాజాగా మృతుల‌ సంఖ్యను వెల్ల‌డించారు. రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లిలో శిథిలాలను తొల‌గిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. శిథిలాల కింద మరో 18 మంది వరకు ఉండవచ్చని ప్రోనిన్ తెలిపారు. కాగా, సైనిక విద్యా సంస్థలో కనీసం 10 నివాస భవనాలు దెబ్బతిన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ విచారణకు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా రష్యా దాడి త‌ర్వాత త‌మ‌కు సహాయం చేస్తున్న వారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు. "ఏం జరిగిందో అన్ని పరిస్థితులపై పూర్తి, సత్వర విచారణకు ఆదేశించాను. అన్ని ఎమ‌ర్జెన్సీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. దాడి తర్వాత సహాయం చేస్తూ, ప్రాణాలను కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత‌లు తెలుపుతున్నాను" అని జెలెన్‌స్కీ అన్నారు. ఈ సంద‌ర్భంగా తమకు మ‌రిన్ని ఫైట‌ర్ జెట్స్‌ను అందించాల్సిందిగా పాశ్చాత్య మిత్ర‌దేశాల‌ను జెలెన్‌స్కీ కోరారు. అప్పుడే ర‌ష్యాను దీటుగా ఎదుర్కోగ‌ల‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :