Monday, 17 March 2025 04:55:58 PM
# Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

Balochistan: పాకిస్థాన్‌లో ఉగ్రదాడుల్లో 70 మందికి పైగా మృతి!

Date : 27 August 2024 04:16 PM Views : 52

Studio18 News - అంతర్జాతీయం / : పాకిస్థాన్‌లో మ‌రోసారి ఉగ్ర‌వాదులు పేట్రేగిపోయారు. నైరుతి పాకిస్థాన్‌లోని బ‌లూచిస్థాన్ ప్రావిన్స్ లో ప‌లుచోట్ల జ‌రిగిన ఉగ్ర‌దాడుల్లో 70 మందికి పైగా మృతిచెందిన‌ట్లు అక్క‌డి మిలిట‌రీ, పోలీస్ అధికారులను ఉటంకిస్తూ మీడియా వెల్ల‌డించింది. లాస్బెలా జిల్లాలోని బేలా ప‌ట్ట‌ణంలోని ఒక జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో 14 మంది సైనికులు, పోలీసులు చ‌నిపోయారు. అలాగే 21 మంది ఉగ్ర‌వాదుల‌ను సైన్యం మ‌ట్టుబెట్టిన‌ట్లు మిలిట‌రీ అధికారులు వెల్ల‌డించార‌ని అల్ జ‌జీరా పేర్కొంది. ముసాఖేల్ జిల్లాలో ఉగ్ర‌వాదులు ఐడీ కార్డుల‌ను ప‌రిశీలించి మ‌రీ పౌరుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వారంతా పంజాబ్‌కు చెందినవార‌ని నిర్ధారించుకుని దాడి చేశారు. అలా 23 మంది పౌరుల‌ను చంపేశారు. ఈ దాడిలో 35 వాహ‌నాల‌ను కూడా త‌గల‌బెట్టారు. క‌లాత్‌లో పోలీస్ పోస్టు, హైవేపై జ‌రిగిన దాడిలో ఐదుగురు పోలీసులు, ఐదుగురు సామాన్య పౌరులు మృతిచెందారు. ఇక బోలాన్ ప‌ట్ట‌ణంలోని రైల్వే వంతెన‌పై ఉగ్ర‌వాదులు దాడి జర‌ప‌గా, స‌మీప ప్రాంతాల్లో ఆరుగురు చ‌నిపోయిన‌ట్లు రైల్వే అధికారి ముహ్మ‌ద్ కాషిఫ్ వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా పంజాబ్ ప్రావిన్స్ ను అనుసంధానించే హైవే వెంబ‌డి ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రావిన్స్ లోని ప్ర‌జ‌లు హైవేల‌కు దూరంగా ఉండాల‌ని బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్‌ ఆర్మీ (బీఎల్ఏ) హెచ్చ‌రించిన కొద్దిసేప‌టికే ఈ దాడులు జ‌రిగాయి. సామాన్యులుగా ప్ర‌యాణిస్తున్న సైనిక సిబ్బందిని ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌మూక‌లు దాడులు జ‌రిపాయ‌ని పాకిస్థాన్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. అయితే, చ‌నిపోయిన‌వారు సామాన్య ప్ర‌జ‌లేన‌ని తెలిపింది. కాగా, దాడుల్లో గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన వైద్య సేవ‌లు క‌లిగిన డేరా ఘాజీ ఖాన్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ముసాఖైల్ దాడిని పాక్ అధ్య‌క్షుడు అసీఫ్ అలీ జ‌ర్దారీ, అంత‌ర్గ‌త‌శాఖ మంత్రి మొహ్సీన్ న‌ఖ్వీ అనాగ‌రిక చ‌ర్య‌గా పేర్కొన్నారు. దాడికి పాల్ప‌డిన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని చెప్పారు. అటు బ‌లూచిస్థాన్ సీఎం స‌ర్ఫ‌రాజ్ బుక్తీ కూడా ఉగ్ర‌దాడుల‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కాగా, అక్క‌డి మీడియా స‌మాచారం ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల్లో 12 మంది ఉగ్ర‌వాదుల‌ను సైన్యం, పోలీసులు మ‌ట్టుబెట్టినట్లు స‌మాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :