Thursday, 15 May 2025 02:26:29 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Bangladesh: భారత్ సరిహద్దుల వద్ద బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జిని అదుపులోకి తీసుకున్న సైన్యం

Date : 24 August 2024 12:46 PM Views : 86

Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో ఆ దేశం నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. వీరిలో అత్యంత ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా భారత్ లోకి వచ్చేందుకు యత్నించిన ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షంషుద్దీన్ చౌదురి మాణిక్ ను ఇండో-బంగ్లా సరిహద్దు వద్ద ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సెల్హెట్ లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్ లోకి వెళ్లేందుకు యత్నించిన షంషుద్దీన్ చౌదురిని అదుపులోకి తీసుకున్నామని బంగ్లాదేశ్ సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు అవామీ లీగ్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె ప్రభుత్వం కూలిపోవడంతో... అక్కడ తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. అనంతరం షేక్ హసీనా ప్రభుత్వంలోని పలువురు మంత్రులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు షేక్ హసీనాను తమకు చట్టబద్ధంగా అప్పగించాలని కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. హసీనాపై ఆ దేశంలో హత్య అభియోగాలతో కూడా కేసులు నమోదయ్యాయి. ఆమెను విచారించేందుకు తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ ను కోరింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :