Tuesday, 11 November 2025 05:08:18 PM
# Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం # Ande Sri: అందెశ్రీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన # Rajyalaxmi: అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆదుకునేందుకు కదిలిన ప్రవాస భారతీయులు # Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్ # Stock Market: ఐటీ, ఆటో షేర్ల జోరు... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ # Pakistan: నేపాల్, బంగ్లాదేశ్‌లలో... భారత్ చుట్టూ ఉగ్రవాద విస్తరణకు పాక్ కుట్ర # Harish Rao: రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా.. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నారు: హరీశ్ రావు # Kommareddi Pattabhiram: రసాయన నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి ఇంకా సమర్ధించుకుంటారా?: వైసీపీపై పట్టాభి ఫైర్ # Sri Bharat: బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు మారలేదు.. పెట్టుబడుల సదస్సును అడ్డుకోవాలనుకుంటున్నారు: శ్రీభరత్ 10 # Chandrababu Naidu: అమరావతి-విశాఖ ఎకనామిక్ రీజియన్... సీఎం చంద్రబాబు కీలక సమీక్ష # Meena: మిథున్ చక్రవర్తి సినిమా చేయమని అడిగితే భయపడ్డా.. ఆయన హోటల్‌కే వెళ్లలేదు: నటి మీనా # Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి # Chandrababu Naidu: మంత్రులను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు # Sunil Gavaskar: ఆ నగదు అందకపోతే నిరాశవద్దు: మహిళా జట్టుకు సునీల్ గవాస్కర్ కీలక సందేశం # Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మీడియాపై అంబటి ఫైర్ # Nalgonda: నల్గొండ జిల్లాలో ఉల్లిపాయల లారీ బోల్తా.. బస్తాలను ఎత్తుకెళ్లిన వాహనదారులు # 'మహారాణి 4'( సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ! # Nadenla Manohar: ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల సమీక్ష... గోడౌన్లు సిద్ధం చేయాలని ఆదేశం # Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్ # Mahesh Babu: మహేశ్ బాబు-రాజమౌళి చిత్రం... 50 వేల మందితో అత్యంత భారీ ఈవెంట్

నేపాల్‌లో బస్సు ప్రమాద ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య

Date : 24 August 2024 11:01 AM Views : 206

Studio18 News - అంతర్జాతీయం / : Nepal Bus Accident : నేపాల్‌లో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్ర‌వారం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోర‌ఖ్‌పుర్ కు చెందిన ప‌ర్య‌ట‌క బ‌స్సులో డ్రైవ‌ర్, ఇద్ద‌రు స‌హాయ‌కులు స‌హా మొత్తం 43 మంది నేపాల్ లోని పొఖ‌రా నుంచి ఖాట్‌మాండుకు బ‌య‌లుదేరారు. త‌న‌హూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో బ‌స్సు అదుపు త‌ప్పి ర‌హ‌దారి ప‌క్క‌న 150 అడుగుల లోతున ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న మార్స‌యాంగ‌డీ న‌దిలో ప‌డిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బ‌స్సు ప్ర‌మాదంతో 16మంది ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మిగిలిన‌వారు గ‌ల్లంతు కావ‌డంతో రెస్క్యూ సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు. తీవ్ర‌గాయాలు కావ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా 25మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయారు. మృతులంతా మ‌హారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను భార‌త్ కు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ వెళ్ల‌నుంది. పది రోజుల పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం భారత్ నుంచి మూడు బస్సుల్లో భారతీయులు నేపాల్ వెళ్లారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వరణ్ గావ్, భుసావాల్ తదితర ప్రాంతాల నుంచి 104 మంది నేపాల్ పర్యటనకు వెళ్లారని, పొఖారాలో రెండు రోజులు పర్యటించి ఖాట్ మాండూకు పయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నేపాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :