Tuesday, 18 March 2025 12:35:49 AM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

నేపాల్‌లో బస్సు ప్రమాద ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య

Date : 24 August 2024 11:01 AM Views : 97

Studio18 News - అంతర్జాతీయం / : Nepal Bus Accident : నేపాల్‌లో జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్ర‌వారం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గోర‌ఖ్‌పుర్ కు చెందిన ప‌ర్య‌ట‌క బ‌స్సులో డ్రైవ‌ర్, ఇద్ద‌రు స‌హాయ‌కులు స‌హా మొత్తం 43 మంది నేపాల్ లోని పొఖ‌రా నుంచి ఖాట్‌మాండుకు బ‌య‌లుదేరారు. త‌న‌హూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో బ‌స్సు అదుపు త‌ప్పి ర‌హ‌దారి ప‌క్క‌న 150 అడుగుల లోతున ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న మార్స‌యాంగ‌డీ న‌దిలో ప‌డిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బ‌స్సు ప్ర‌మాదంతో 16మంది ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మిగిలిన‌వారు గ‌ల్లంతు కావ‌డంతో రెస్క్యూ సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు. తీవ్ర‌గాయాలు కావ‌డంతో వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా 25మంది ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయారు. మృతులంతా మ‌హారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను భార‌త్ కు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ వెళ్ల‌నుంది. పది రోజుల పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం భారత్ నుంచి మూడు బస్సుల్లో భారతీయులు నేపాల్ వెళ్లారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వరణ్ గావ్, భుసావాల్ తదితర ప్రాంతాల నుంచి 104 మంది నేపాల్ పర్యటనకు వెళ్లారని, పొఖారాలో రెండు రోజులు పర్యటించి ఖాట్ మాండూకు పయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నేపాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :