Sunday, 08 February 2026 09:51:14 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Visa Free Entry: భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని క‌ల్పించిన‌ శ్రీలంక

Date : 23 August 2024 11:08 AM Views : 2234

Studio18 News - అంతర్జాతీయం / : భార‌తీయుల‌కు పొరుగు దేశం శ్రీలంక తీపి క‌బురు చెప్పింది. భార‌త పౌరుల‌కు ఆరు నెల‌ల పాటు వీసా ర‌హిత ప్ర‌వేశాన్ని క‌ల్పించింది. భారత్‌ సహా 35 దేశాల వారికి ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు ఆ దేశ మంత్రిమండ‌లి తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి ఈ నిర్ణ‌యం అమలులోకి వస్తుంది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. భార‌త్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా త‌దిత‌ర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి. కాగా, శ్రీలంకలో ఆన్ అరైవల్ వీసాల కోసం పెరిగిన ఛార్జీల‌ను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం నేపథ్యంలో అక్క‌డి స‌ర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇదిలాఉంటే.. భారత్‌, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుండి వచ్చే ప్రయాణికులకు ఉచిత వీసాలు అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను గతేడాది అక్టోబర్‌లో శ్రీలంక తీసుకువ‌చ్చింది. ఈ ప్రాజెక్ట్ గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను చేర్చి ఈ పైల‌ట్ ప్రాజెక్ట్‌ను విస్తరించింది. ఇక పైలట్ ప్రాజెక్ట్‌లోని ప్రయాణికులు శ్రీలంక‌కు రాగానే డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇస్తారు. ఫ్రీ వీసా ద్వారా శ్రీలంక‌లో 30 రోజుల వ‌ర‌కు బసకు అవ‌కాశం ఉంటుంది. కాగా, శ్రీలంక‌కు ఇండియానే టాప్ ఇన్‌బౌండ్ టూరిజం మార్కెట్. గతేడాది అక్టోబర్ లో ఆ దేశానికి వెళ్లిన భార‌తీయ ప‌ర్యాట‌కుల సంఖ్య 28వేల‌ కంటే ఎక్కువ. ఇది ఆ దేశ ప‌ర్యాట‌కుల సంఖ్య‌లో 26 శాతం. ఇలా భార‌త్‌ అగ్రస్థానాన్ని ఆక్ర‌మించింది. అలాగే రష్యా 10 వేల మంది పర్యాటకుల‌తో రెండో స్థానంలో నిలిచింది. భార‌త్‌, శ్రీలంక స్నేహ‌పూర్వ‌క‌ సంబంధం "మా విదేశాంగ విధానంలో చాలా ముఖ్యమైంది" అని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అన్నారు. శ్రీలంక ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌ధాన వ‌న‌రు ఇండియానే అని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 30,000 మంది భారతీయులు వచ్చార‌ని తెలిపారు. శ్రీలంక ఎంపీ వీ రాధాకృష్ణన్ కూడా శ్రీలంక ప‌ర్యాట‌కానికి భార‌తీయులే కీల‌కం అని అన్నారు. శ్రీలంకకు వచ్చే సందర్శకులలో 60 శాతం భారతదేశం నుండి వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :