Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి ఇప్పుడు ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఆపరేషన్ రావణ్ సినిమా తెరకెక్కింది. రాధికా శరత్ కుమార్, రఘు కుంచె.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆపరేషన్ రావణ్ సినిమా జులై 26న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా డైరెక్టర్ వెంకట సత్య తాజాగా మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు వెంకట సత్య సినిమా గురించి మాట్లాడుతూ.. మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. జరిగే పనులకు కారణమైన ఆలోచనలను మేము విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసినా, కరెక్ట్ చేసినా దానికి ఆ మనిషి ఆలోచనలే కారణం. మనం ఏ పని చేసినా ముందు ఆలోచనల్లో చేయాలా వద్దా అనే సంఘర్షణ జరుగుతుంది. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ఈ సినిమా తీసాను. సరిగ్గా చూస్తే రామాయణం కూడా థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఆపరేషన్ రావణ్ లో రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చినట్టు మా సినిమాలో మాస్క్ పెట్టుకుని వస్తాడు. అందుకే ఈ సినిమాకు ‘ఆపరేషన్ రావణ్’ టైటిల్ పెట్టాం అని తెలిపారు.అలాగే సినిమాలో.. ఒక సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని, అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అని చూపిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఆగస్టు 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ మార్చుకొని జులై 26కి వస్తున్నాం అని చెప్పారు. ఇక రక్షిత్ అట్లూరి సూపర్ హిట్ సినిమా పలాసకు సీక్వెల్ కూడా అంటుందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ రావణ్ సినిమాలో సినిమా మొదలయిన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే సిల్వర్ కాయిన్ ఇస్తాము. అలా వెయ్యి మందికి సిల్వర్ కాయిన్స్ ఇస్తాము అని బంపర్ ఆఫర్ ఇచ్చారు డైరెక్టర్ వెంకట సత్య.
Admin
Studio18 News