Friday, 13 June 2025 03:39:59 AM
# ట్రైనీ డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం... ఘటన స్థలంలో అందినకాడికి దోపిడీలు! # కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ # ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌ # కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం! # జర్నలిస్టు కృష్ణంరాజుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు # కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...? # అహ్మదాబాద్ విమాన దుర్ఘటన... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడిన ప్రధాని మోదీ # ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ # అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి # రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయిన రఘురామ... కూల్చివేతకు ఆదేశాలు! # పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ! # రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి # 'తల్లికి వందనం' నిధులు నేడే విడుదల.. 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి # బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి # ఏఎంఏ అధ్యక్షుడిగా మన తెలుగు వైద్యుడు.. అమెరికా వైద్య చరిత్రలో నూతన అధ్యాయం! # ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి # కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం # తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ # విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు # యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు

Kim Jong Un: కిమ్ కీలక నిర్ణయం... పర్యాటకులకు ఆహ్వానం

Date : 15 August 2024 11:51 AM Views : 93

Studio18 News - అంతర్జాతీయం / : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశాన్ని సందర్శించాలనుకునే విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పారు. ఈశాన్య నగరమైన సంజియోన్ కి డిసెంబర్ నెల నుండి అంతర్జాతీయ పర్యాటకాన్ని పునః ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలకూ పర్యాటకాన్ని అనుమతించవచ్చని ఆ దేశ టూరిస్ట్ కంపెనీలు బుధవారం వెల్లడించాయి. కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఆ దేశం తన సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. 2020 నుండి అంతర్జాతీయ పర్యాటకులను ఉత్తర కొరియా నిషేధించింది. తాజాగా కొవిడ్ తగ్గడంతో తమ దేశానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆహ్వానిస్తొంది. ఈ ప్రకటన కోసం నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న కొరియా టూర్స్ హర్షం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాలోని సంజియోన్ నగరం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో పర్యాటకుల కోసం అపార్ట్ మెంట్లు, స్కీ రిసార్ట్స్, హోటళ్లు ఏర్పాటు అయ్యాయి. మరో ట్రావెల్ ఏజన్సీ కేటీజీ టూర్స్ సైతం ఈ శీతాకాలం నుండి పర్యాటకులు సంజియోన్ కు వెళ్లవచ్చని ప్రకటించింది. సంజియోన్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు అధికారికంగా పర్యాటక కార్యకలాపాలు 2024 డిసెంబర్ లో తిరిగి ప్రారంభమవుతాయని తమ స్థానిక భాగస్వామి నుండి ధ్రువీకరణ పొందామని బీజింగ్ కు చెందిన కొరియో టూర్స్ తన వెబ్ సైట్ లో తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉత్తర కొరియా గత ఏడాది అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ఆ క్రమంలో రష్యన్ పర్యాటకులు ఫిబ్రవరిలో ప్రైవేట్ పర్యటన కోసం ఉత్తర కొరియాను సందర్శించారు. జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా విదేశీ ఉన్నతాధికారులు ఆ దేశాన్ని సందర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :