Friday, 14 February 2025 07:19:21 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

DDOS Attack: ట్రంప్ ఇంటర్వ్యూపై డీడీఓఎస్ అటాక్.. ఏంటీ దాడి?

Date : 13 August 2024 01:48 PM Views : 471

Studio18 News - అంతర్జాతీయం / : డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ అరుదైన ఇంటర్వ్యూకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తొలుత దాదాపుగా 80 లక్షల మంది ఇంటర్వ్యూను విన్నారు. తర్వాత ఈ సంఖ్య 2.7 కోట్ల మందికి చేరింది. అయితే, ఇంటర్వ్యూ ప్రారంభమయ్యే సమయానికి సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇంటర్వ్యూ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఆడియో సరిగా వినిపించలేదని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. తొలుత సాంకేతిక సమస్యగా భావించినప్పటికీ తర్వాత డీడీఓఎస్‌ అటాక్‌ జరిగిందని మస్క్‌ తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూపై ట్రంప్ స్పందిస్తూ.. అన్ని రికార్డులు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది శతాబ్దపు ఇంటర్వ్యూ అని వ్యాఖ్యానించారు. ఏంటీ డీడీఎస్ అటాక్..? డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్) అటాక్ లక్ష్యం ఓ వెబ్ సైట్ లేదా సర్వర్ కు తాత్కాలికంగా వీక్షకులను దూరం చేయడం. టార్గెట్ చేసిన సర్వర్ కు డీడీఓఎస్ నుంచి ట్రాఫిక్ పోటెత్తుతుంది. దాంతో వెబ్ సైట్ పనితీరు మందగిస్తుంది. కొన్ని సందర్బాలలో వెబ్ సైట్ ఆఫ్ లైన్ లోకి మారుతుంది. దీంతో నిజమైన వ్యూయర్లు లాగిన్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అటాక్ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్, మస్క్ ఇంటర్వ్యూను ఎక్కువ మంది యూజర్లు వినకుండా అడ్డుకోవడానికి ఈ దాడి జరిగిందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :