Sunday, 16 March 2025 02:37:34 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

Vinod Khosla: డొనాల్డ్ ట్రంప్‌ను సమర్థించిన ఎలాన్ మస్క్‌పై భారత సంతతి సీఈఓ ఆగ్రహం

Date : 22 July 2024 11:23 AM Views : 116

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్టు జో బైడెన్ ప్రకటించడం అగ్రరాజ్య రాజకీయాల్లో పెను కలకలానికి దారి తీసింది. అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పేరును సమర్థిస్తున్నట్టు కూడా బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత అమెరికన్ సీఈఓ వినోద్ ఖోస్లా, టెక్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌ల మధ్య రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విషయంలో మాటల యుద్ధం మొదలైంది. డొనాల్డ్ ట్రంప్‌కు దీటైన అభ్యర్థిని డెమోక్రాట్లు ఎన్నుకోవాలంటూ తొలుత వినోద్ ఖోస్లా ట్వీట్ చేశారు. ‘‘ట్రంప్‌ను సులువుగా ఓడించే అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓపెన్ కన్వేన్షన్ నిర్వహించేందుకు సమయం ఆసన్నమైంది. @GovWhitmer లేదా @GovernorShapiro ఇందుకు తగిన వారు. అతివాదుల చెరలో అమెరికా చిక్కుకోకుండా వీళ్లు ఆపగల సమర్థులు. లెఫ్ట్, రైట్ భావజాలం కాకుండా మధ్యేమార్గం ఎంచుకునేందుకు ఇదే సరైన సమయం. ఆర్థికంగా, పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన వైఖరి కోరుకునే వారందరూ దీన్ని సమర్థించాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ ట్రంప్ కంటే మంచి అభ్యర్థి లేడనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. దీనిపై వినోద్ ఖోస్లా ఘాటుగా స్పందించారు. ‘‘అత్యాచారాలు, అబద్ధాలు చెప్పేవారు, మహిళల్ని కించపరిచే వారు, కనీస విలువలు లేని వారిని సమర్థించలేను. ఆయన పన్నులు తగ్గించొచ్చు, నిబంధనలను సరళీకరించొచ్చు. అంతమాత్రాన విలువల లేమిని అంగీకరించలేము కదా. పర్యావరణ రక్షణలో దేశాన్ని పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే వాళ్లు అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటామా? అలాంటి వాళ్లు నీ సంతానానికి అదర్శం కావాలని కోరుకుంటావా?" అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు. దీంతో, వీరిద్దరి సంవాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :