Sunday, 20 April 2025 02:37:58 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. 7 లక్షలాది మంది హాజరు!

Date : 11 August 2024 11:52 AM Views : 164

Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చినా అక్కడి పరిస్థితులు చల్లారడం లేదు. మైనారిటీలైన తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు నిన్న (శనివారం) రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. రాజధాని ఢాకా, రెండవ ప్రధాన నగరమైన చిట్టగాంగ్‌లో భారీ నిరసనలు చేపట్టారు. ఈ ర్యాలీల్లో సుమారు 7 లక్షల మంది హిందువులు పాల్గొన్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. మైనారిటీలను వేధించిన వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని హిందువులు డిమాండ్ చేశారు. మైనారిటీలకు 10 శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని, మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. మైనారిటీల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లిం నిరసనకారులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీతో ఢాకా నగరంలో 3 గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా అమెరికా, యూకేలలో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. కాగా షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసాకాండలో మైనారిటీ వర్గాలపై 205 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. ఎక్కువగా హిందువులపైనే దాడులు జరిగాయి. వందలాది మంది హిందువులపై, వారి ఇళ్లు, వ్యాపారాలపై కూడా దాడులు జరిగాయి. చాలామంది గాయపడ్డారు. ఇద్దరు హిందూ నాయకులు హింసకు బలయ్యారు. అంతేకాదు అనేక హిందూ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు పొరుగున ఉన్న భారత్‌కు పారిపోయి వచ్చారు. స్పందించిన మధ్యంతర ప్రభుత్వ సారధి.. దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారధి ముహమ్మద్ యూనస్ శనివారం ఖండించారు. ఈ దాడులను హేయమైన చర్యలుగా ఆయన అభివర్ణించారు. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలంటూ నిరసనలు చేపడుతున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు కూడా ఈ దేశ ప్రజలే కదా?. మీరు దేశాన్ని రక్షించగలిగారు. మరి కొన్ని కుటుంబాలను రక్షించలేరా?. వారు నా సోదరులు. ఎవరూ వారికి హాని చేయవద్దు. మనమంతా కలిసి పోరాడాం. కలిసి జీవిద్దాం’’ అని యూనస్ పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :