Thursday, 15 May 2025 03:24:56 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Bangladesh Crisis: తండ్రి తెచ్చిన రిజర్వేషన్లే... షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి!

Date : 06 August 2024 03:18 PM Views : 183

Studio18 News - అంతర్జాతీయం / : భారత్ పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇప్పుడు సైనిక పాలనలోకి వెళ్లింది. దీనికంతటికీ కారణం బంగ్లాదేశ్ జాతిపిత, మాజీ అధ్యక్షుడు ముజిబుర్ రెహ్మాన్ గతంలో తెచ్చిన రిజర్వేషన్లు. నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ముజిబుర్ రెహ్మాన్ కుమార్తే. తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు ఆమె రాజీనామాకు దారితీశాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటం జరగ్గా, పెద్ద సంఖ్యలో అసువులుబాశారు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో స్వాతంత్ర్య పోరాటయోధులకు 30 శాతం, స్వాతంత్ర్య పోరాటంలో శత్రుసైన్యం చేతిలో అత్యాచారాలకు గురైన మహిళలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ మేరకు 1972లో ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంలోని ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. ఆ తర్వాత 1996లో ఈ రిజర్వేషన్లను స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు విస్తరింపజేశారు. 2009 నాటికి స్వాతంత్ర్య పోరాట యోధుల మనవళ్లు, మనవరాళ్లకు కూడా వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ తరహా రిజర్వేషన్లపై 2013లోనే నిరసన జ్వాలలు రాజుకున్నాయి. బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాలు సాధించలేకపోయిన వందలాది మంది రోడ్లెక్కి నిరసనలు ప్రారంభించారు. ఈ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టుల్లోనూ విచారణకు వచ్చింది. ఈ విధమైన రిజర్వేషన్లను బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కుదిస్తూ, గత నెల 21న కీలక తీర్పు ఇచ్చినప్పటికీ, అసంతృప్తి గళాలు మరింత విజృంభించాయి. దాంతో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా ప్రధాన నగరాలన్నీ నిరసనలతో భగ్గుమన్నాయి. 300 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు బలంగా వినిపించాయి. చివరికి, ఆందోళనకారులు నిన్న మధ్యాహ్నం ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించడం ఈ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి పరాకాష్ఠగా నిలిచింది. దాంతో, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :