Monday, 17 March 2025 05:19:54 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

షేక్ హసీనా భారత్‌లోకి అడుగుపెట్టే ముందు వాయుసేన ఫైటర్ జెట్లు ఏం చేశాయో తెలుసా!

Date : 06 August 2024 10:28 AM Views : 51

Studio18 News - అంతర్జాతీయం / : Bangladesh Government Crisis : కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఆమె దేశం విడిచిపెట్టారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్ లోని జమాతే ఇస్లామీ అనే సంస్థ పెద్ద ప్రకటన చేస్తూ.. షేక్ హసీనా ఎక్కడ బసచేసినా ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొంది. ప్రధాని పదవికి రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ ను షేక్ హసీనా విడిచిపెట్టారు. ఆమె ఏజేఎక్స్ అనే సీ-130జే విమానంలో సోమవారం సాయంత్రం 5.30గంటల సమయంలో భారత్ సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు భారత భద్రతా బలగాలు గమనించాయి. అందులో ఎవరు ఉన్నారో ముందే పసిగట్టిన అధికారులు భారత్ లోకి అనుమతించాలని ఆదేశించారు. విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానాన్ని భారత ఫైటర్స్ జెట్లు అనుసరించాయి. బీహార్, ఝార్ఖండ్ మీదుగా ఆవి రక్షణ కల్పించాయి. ఆమె భారత్ లోకి అడుగుపెట్టే సమయంలో భారత వాయుసేన, సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందే సిద్ధపడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షేక్ హసీనా విమానం సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో హిండన్ ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెతో భేటీ అయ్యారు. ఇదిలాఉంటే.. హసీనా భారత్ దేశానికి చేరుకోవటంతోపాటు.. బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు. మరోవైపు ఢాకా నగరానికి ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :