బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్

Spread the love
  • ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో మాట్లాడిన బీజేపీ నేత
  • బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారన్న సంజయ్
  • డబ్బులిచ్చి కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణ
  • ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తున్నామని వెల్లడి
bjp ts chief bandi sanjay viral comments on bengaluru drugs case
కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ కేసు ఇప్పటికే క్లోజ్ కాగా… ఈ కేసును రీఓపెన్ చేయిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో గురువారం మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు పోలీసులకు డబ్బులిచ్చి మరీ కేసును కొట్టివేయించుకున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ నేతలు ఈ కేసులో తమ పేర్లను కొట్టివేయించుకున్నారని ఆయన చెప్పారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com