- ప్రత్తిపాడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వరుపుల
- పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కిన వైనం
- ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం వరుపులపై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వరుపుల సుబ్బారావు.. 1983 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన వరుపుల మరోమారు ముద్రగడ చేతిలోనే ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన వరుసగా మూడో పర్యాయం కూడా ఓడిపోయారు. ఆ తర్వాత మరోమారు టీడీపీలో చేరిన ఆయన తొలి సారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల మరోమారు ఓడి… 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో టికెట్: రాకపోవడంతో ఆయన వైసీపీలో చేరి… ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.