- సెర్బియా రీజియన్ లోని మంచు ఫలకాల కింద గుర్తింపు
- మొత్తం 13 వైరస్ లను పునరుద్ధరించిన శాస్త్రవేత్తలు
- ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందంటున్న పరిశోధకులు
వాతావరణ మార్పులతో వైరస్ ల విపత్తు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరిగిపోతున్న భూతాపంతో మంచు కొండలు కరుగుతున్నాయని.. వీటి కింద వేల సంవత్సరాల క్రితం దాగిపోయిన వైరస్ లు వెలుగు చూసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు మంచులో గడ్డకట్టిన ఇలాంటి డజను వైరస్ లను పునరుద్ధరించారు. అందులో ఒకటి 48,500 ఏళ్ల నాటి వైరస్ కూడా ఉంది.
రష్యాలోని సైబీరియా రీజియన్ లో మంచు కింద పురాతన వైరస్ నమూనాలను ఐరోపా శాస్త్రవేత్తలు సేకరించారు. 13 కొత్త వ్యాధి కారకాలను గుర్తించడమే కాకుండా వర్గీకరించారు. వీటిని జాంబీ వైరస్ గా చెబుతున్నారు. వేలాది ఏళ్ల నుంచి మంచు కింద ఘనీభవించి ఉన్నప్పటికీ అవి ఇన్ఫెక్షన్ ను కలిగించగలవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు పండోరా వైరస్ ను 48,500 ఏళ్ల క్రితం నాటి అతి ప్రాచీన వైరస్ గా భావిస్తున్న శాస్త్రవేత్తలకు, ఇప్పుడు అంతే వయసు, అంతకంటే ఎక్కువ ఉన్న జాంబీ వైరస్ కనిపించడం గమనార్హం. వాతావరణ మార్పులతో పొంచి ఉన్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడం కోసమే వారు ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు పాలు పంచుకున్నారు.