కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు నటిస్తోన్న తొలి సినిమా ‘నాట్యం’ టీజర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేస్తూ, ఈ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. కథను మనం వింటామని, అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటామని ఇందులో వినపడుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి.
నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడమని ఆదిత్య మేనన్ ఓ పాపకు చెబుతాడు. నువ్వు పాటలు కూడా పాడతావా? అంటూ హీరోయిన్ను హీరో అడుగుతాడు. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా కొబ్బరికాయ కొడుతుంది. చక్కని సంగీతాన్ని జోడిస్తూ ఈ టీజర్ను కట్ చేశారు.
ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ను హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన విడుదల చేసిన విషయం తెలిసిందే.
More Stories
ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వివేక్ కన్నుమూత.. శోకసంద్రంలో కోలీవుడ్
చరణ్ జోడీగా రష్మికను సెట్ చేసిన శంకర్?
‘ఆచార్య’ అనుకున్న డేట్లో ‘లవ్ స్టోరీ’?