#BODUPPAL: దళితులపై దాడులు చేస్తే ఉపేక్షించం …
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో గ్లోబల్ ఛాంప్స్ పాఠశాల కరెస్పాండంట్ కామేశ్వరి తనపై దాడి చేశారని చేస్తున్న ఆరోపణలను బోడుప్పల్ 28 వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఖండించారు. 2018 సంవత్సరంలో తన భవనాన్ని గ్లోబల్ ఛాంప్స్ స్కూల్ యాజమాన్యానికి కిరాయికి ఇచ్చానని. కోవిడ్ సాకుతో గత మూడు సంవత్సరాలుగా అద్దె చెల్లించడం లేదని అందుకు కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఈ తరుణంలో స్కూల్ ప్రిన్సిపాల్ కావాలనే తన భార్య పై కులం పేరుతో దూషించడం వల్ల స్కూల్ సిబ్బందితో జరిగిన వాగ్వాదం లో తన భార్యకు , కామేశ్వరికి మధ్య తోపులాట జరిగిందని కానీ కామేశ్వరి కార్పొరేటర్ దాడి చేశాడని అసత్య ప్రచారాలు చేస్తుందని అన్నారు. దళితుడైన నన్ను, నా రాజకీయ అభివృద్ధిని ఓర్వలేక ఇబ్బంది పెడుతున్నారని ఈ విషయంలో పార్టీని వ్యక్తులను దూషించటం సరికాదని ఇది ఒక ఇంటి యజమాని.. కిరాయి దారుడు మధ్య జరిగిన సంఘటన గా మాత్రమే చూడాలని చీరాల నరసింహ అన్నారు.