న్యూయార్క్ లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను ఆస్వాదిస్తున్న ధోనీ

Spread the love
  • అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ
  • ఇవాళ కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్
  • మ్యాచ్ కు హాజరైన ధోనీ
Dhoni attends US Open Tennis match in New York

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ అయిపోయాక విరామ సమయాన్ని తన హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా న్యూయార్క్ లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలను ఆస్వాదిస్తూ ధోనీ కెమెరాల కంటబడ్డాడు.

ఈ ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి) యూఎస్ ఓపెన్ లో వరల్డ్ నెంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్, జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ధోనీ కూడా హాజరయ్యాడు. అల్కరాజ్ బెంచ్ కు వెనుకగా కూర్చుకున్న ధోనీని పలుమార్లు టీవీలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

అయితే, యూఎస్ ఓపెన్ కెమెరామన్లకు ధోనీ ఎవరో తెలియదు కాబట్టి, ధోనీపై కెమెరాలను పెద్దగా ఫోకస్ చేయలేదు. అదే, ఏ క్రికెట్ ఈవెంట్ అయ్యుంటే కెమెరాలన్నీ ధోనీ వైపు తిరిగుండేవి.

అభిమానులు ధోనీని గుర్తించి, వీడియో ఫుటేజిలోని క్లిప్పింగ్స్ ను, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సోషల్ మీడియా సైట్లలో  ఎక్కడ చూసినా యూఎస్ ఓపెన్ లో ధోనీ విజువల్సే కనిపిస్తున్నాయి.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com