Hyderabad : దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు. ఆమె ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఈ లోపే ఇంతటి విషాదం జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.
ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని విదేశాల్లోని తమ బంధువులకు కూడా తెలియజేశారు .